టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం జగన్కు తెలియదు. ఆస్తుల దోపీడే గానీ.. తరాల మధ్య ప్రేమలు పట్టించుకోడు జగన్. ప్రేమలు పట్టించుకోడు కాబట్టే జగన్ చెల్లెళ్లను దూరంగా పెట్టాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైనది. దీన్ని రద్దు చేస్తాం.’ అని అన్నారు.