చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా..గోవిందా! అని చోడవరం సభలో సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. సూపర్ 6.. సూపర్ 7.. బెంజ్ కార్ హామీలు నమ్మితే కొండచిలువ నోట్లో తలపెట్టినట్టే.. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు రావు, రిజర్వాయర్లు ఖాళీ అవుతాయని ఎద్దేవా చేశారు. మీ జగన్ కు ఓటేస్తే పథకాలు అన్నీ కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు అన్నీ ముగింపు అని తెలిపారు.