ఏపీ రెవెన్యూ శాఖలో కీలక ఆదేశాలు ఇచ్చారు.కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపు వంటి ఫైళ్లను నిలుపుదల చేయాలని ఆదేశించారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు.