ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్

28936చూసినవారు
ఏపీకి ఇంటెలిజెన్స్ అలర్ట్
ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీఎస్‌పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని పేర్కొంది. ఈ మేరకు జిల్లాల ఎస్పీలను హెచ్చరించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి.. ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్