మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తనను దుర్భాషలాడారని కండ్లకుంట టీడీపీ పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు. డీఎస్పీ ఉండగానే నాపై దాడికి యత్నించారు. నన్ను చంపేంత తప్పు ఏం చేశాను? వైసీపీ చేస్తున్న రిగ్గింగ్ను అడ్డుకోవడమే నేను చేసిన తప్పా?" అని ప్రశ్నించారు.