'మేమంతా సిద్ధం' పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర నేడు అన్నమయ్య జిల్లా చీకటిమానుపల్లె నుంచి ప్రారంభంకానుంది. మొలకల చెరువు, పెద్దపాల్యం, వేపురి కోట మీదుగా బుర్రకాయల కోట క్రాస్, గొల్లపల్లి మీదుగా అంగళ్ళకు బస్సు యాత్ర చేరుకోనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మదనపల్లె టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.