ప్రజల భూములపై సీఎం జగన్ పెత్తనమేంటని చంద్రబాబు మండిపడ్డారు. "ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చారు. ప్రజల భూములను జగన్ తన దగ్గర పెట్టుకుంటారంట. మీ భూమి ఇప్పుడు సైకో జగన్ గుప్పిట్లో ఉంది. భూమి మీది.. పెత్తనం జలగది. సైకో అందరి మెడలకు ఉరితాడు వేశారు. జగన్ ఎప్పుడు లాగితే అప్పుడు మీ ప్రాణం పోతుంది. మీ భూమిని మీకు ఇప్పించే బాధ్యత నాది." అని దర్శి సభలో చంద్రబాబు చెప్పారు.