ఏపీ ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో జగన్ తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయి మాట్లాడారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వంపై ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదని, కానీ ఫలితాలు మాత్రం విభిన్నంగా వచ్చాయని తెలిపారు. పోలింగ్కు ముందు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించామని, 17 లక్షల శాంపిళ్లు తీసుకున్నామన్నారు.