జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో రోజు పిఠాపురంలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ పాదగయ క్షేత్రంలో ఉదయం 11గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 12 గంటలకు శ్రీ పాద శ్రీవల్లభ దత్తత్రేయుని దర్శించుకుని పూజలు చేయనున్నారు. ఆ తర్వాత బషీర్ బీబీ దర్గా సందర్శన అనంతరం 1 గంటకు జనసేన, టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.