సజ్జల కనుసన్నల్లోనే జెత్వానీ వ్యవహారం: బుద్దా వెంకన్న

63చూసినవారు
సజ్జల కనుసన్నల్లోనే జెత్వానీ వ్యవహారం: బుద్దా వెంకన్న
వైసీపీ హయాంలో అరాచకాలకు నటి జెత్వానీ ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుంది. సజ్జల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం మొత్తం నడిపారు. ఆనాటి డీజీపీ కూడా ఈ ఘటనకు బాధ్యత వహించాలి. విద్యాసాగర్, సజ్జల, రాజేంద్రనాథ్ రెడ్డి, కాంతి రాణా టాటాలను అదుపులోకి తీసుకోవాలి.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్