
బద్వేలు: డ్రగ్స్ రహిత సమాజం కోసంపాటుపడదాం
డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదామని బద్వేలు ఎక్సైజ్ సీఐ సీతారామిరెడ్డి సూచించారు. శుక్రవారం సాయంత్రం డీవైఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నివారణ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ యువత మత్తు, మాదక ద్రవ్యాల వంటి జోలికి వెళ్ళవద్దని, వాటికి దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ నివారణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న డీవైఎఫ్ఎస్ఐ సిబ్బందిని ఆయన అభినందించారు.