పర్వతగిరి రిజర్వాయర్ గురించి అసెంబ్లీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం చర్చించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తూ వస్తున్నదని అన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలో పెద్ద చెరువును రిజర్వాయర్ గా చేశారు. దానిమీద అవకతవకలు చేసి 80 లక్షల రూపాయల బిల్లు తీసుకున్నారు. దీనిమీద విజిలెన్స్ ఫిర్యాదు కి చేశామన్నారు. అది ఇంకా విచారణలో ఉందన్నారు.