పేదలు వేసుకున్న గుడిసెలపై శ్రీనివాసపురం వాసుల దాడి

81చూసినవారు
గోపవరం మండలం తహసిల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ప్రభుత్వ స్థలంలో పేదలు వేసుకున్న గుడిసెలపై శ్రీనివాసపురం వాసులు కర్రలతో బుధవారం దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఒకరికి తలకు తీవ్ర గాయం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని అదుపు చేయగలిగారు. అనంతరం అందర్నీ అక్కడి నుంచి పంపించి వేశారు. కాగా సంఘటన జరిగిన విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్