గుర్రంకొండ: పుట్టిన రోజు కోసం కేకు కొందామని వెళ్లి.. మృత్యుఒడిలోకి

65చూసినవారు
గుర్రంకొండ: పుట్టిన రోజు కోసం కేకు కొందామని వెళ్లి.. మృత్యుఒడిలోకి
సోదరుడి పుట్టినరోజు వేడుకలకు కేక్ కొందానికి వెళ్ళిన మేఘన(18) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె తండ్రి బాబు, సోదరుడు కార్తిక్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుర్రంకొండ మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఆటో దిగి వస్తుండగా కుక్క అడ్డు రావడంతో డ్రైవర్ ఆటోను పక్కకు తిప్పాడు. మేఘన కింద పడటంతో ఆమెపై ఆటో పడింది. మేఘనను ఆసుపత్రికి తరలించగా, మార్గంలోనే మృతి చెందింది. గుండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్