చిట్వేలి మండలం పోళ్ళోపల్లి గ్రామానికి చెందిన పలువురు ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు సమక్షంలో ఆదివారం టిడిపి నుండి వైసిపీలో చేరారు. ఈ కార్యక్రమంలో చిట్వేలి మండల వైసిపి కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర కనీస వేతనాల కార్పొరేషన్ డైరెక్టర్ మలిశెట్టి వెంకటరమణ, ఉప సర్పంచ్ మహేష్ రెడ్డి, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, దేవరాజు, విక్రమ్, రమణారెడ్డి పాల్గొన్నారు.