ఉప్పలగుప్తం. ఈనెల 13 న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మళ్లీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని అమలాపురం నియోజకవర్గ వైసీపీ సీనియర్ నేత గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు అన్నారు. గురువారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రమణారావు వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటిలోనూ ఓటర్లతో రమణారావు మాట్లాడి మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలో వివరించారు.