గ్రామాలను అభివృద్ధి పథంలో నడపడమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

65చూసినవారు
గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. గోపాలపురం మండలంలోని ఉప్పరగూడెంలో నూతనంగా నిర్మించిన కల్వర్టును, కమ్యూనిటీ హాల్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. కల్వర్ట్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఎన్నిసార్లు విన్నవించినా గత వైసీపీ నాయకులు పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరించామన్నారు.

సంబంధిత పోస్ట్