మండపేట మండలంలోని పాలతోడు గ్రామ దేవత శ్రీ బాపనమ్మ అమ్మవారికి, గ్రామానికి చెందిన యేలేటి వెంకట్రాజు, లక్ష్మీకాంతం దంపతుల జ్ఞాపకార్ధం 80 వేలు రూపాయలు విలువైన వెండిపల్లెం (పూజా పల్లెం) బహుకరించారు. సోమవారం అమ్మవారి ఆలయానికి విచ్చేసిన వారి కుమార్తె రెడ్డి మాణిక్యం, కుమారుడు యేలేటి బుల్లిరాజు లు ఆలయ కమిటీ ధర్మకర్తలు యేలేటి వెంకట్రావు, యేలేటి రామచంద్రరావు లకు వెండిపల్లెం అందజేశారు.