ఐ. పోలవరంలో కలెక్టర్ మహేశ్ పర్యటన

54చూసినవారు
ఐ. పోలవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ బుధవారం పర్యటించారు. మండల పరిధిలోని మురమళ్ల ఎదురులంక గుత్తెనదీవి, గోగుల్లంక గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఎగువ పరివాహక ప్రాంతాలలో ఇటీవల 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు కోనసీమ ప్రాంతం వరద ముంపు బారిన పడే అవకాశం ఉందన్నారు. పల్లపు ప్రాంత లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్