మృతుడు ఉమామహేశ్వరరావుగా గుర్తింపు

70చూసినవారు
మృతుడు ఉమామహేశ్వరరావుగా గుర్తింపు
ముమ్మిడివరంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ముమ్మిడివరం నుంచి అమలాపురం వెళ్తున్న ఆటో అదుపుతప్పి బొండాయికోడు కాలువలో బోల్తా పడటంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. అతడిని చిప్పలపాలెం గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్