ధవళేశ్వరం వద్ద క్రమంగా తగ్గుతున్న వరద

76చూసినవారు
ధవళేశ్వరం వద్ద క్రమంగా తగ్గుతున్న వరద
గోదావరి వరద క్రమంగా తగ్గుతూ వస్తోంది. రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయం 6 గంటలకు వరద నీటిమట్టం 9. 90 అడుగులకు చేరింది. 7,33,627 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అలాగే భద్రాచలం వద్ద ఉదయం ఆరు గంటలకు గోదావరి వరద నీటిమట్టం 38.6 అడుగులకు వరద తగ్గింది. ధవళేశ్వరం, భద్రాచలం వద్ద గోదావరి క్రమేపి తగ్గుతోందని కేంద్ర జల సంఘం అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్