చల్లపల్లి లయన్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక లయన్స్ మల్టీపర్పస్ సర్వీస్ సెంటరులో శనివారం ఉచిత నేత్రపరీక్షా శిబిరం శనివారం నిర్వహించారు. చల్లపల్లి లయన్స్ క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ కొల్లిపర మధు సతీమణి పార్వతి జ్ఞాపకార్ధం మధు సహకారంతో శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో డాక్టర్ వెంకట్రావు 40 మందిని పరీక్షించి 11మందిని ఐఓఎల్ ఆపరేషన్లకు ఎంపిక చేసి ఆపరేషన్లు నిర్వహించేందుకు గూడూరు నేత్ర నేత్రాలయంకు పంపారు.