ధాన్యం నగదు తక్షణమే చెల్లించాలని రైతులు డిమాండ్

1059చూసినవారు
జనవరి నెలలో విక్రయించిన ధాన్యానికి తక్షణమే నగదు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామానికి చెందిన రైతులు నగదు అందక ఇబ్బందులు పడుతున్నామని మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి కూలీలకు నగదు చెల్లించామని, రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు రాక అగచాట్లు పడుతున్నామన్నారు. జిల్లా అధికారులు స్పందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్