నీటిముంపులోని పొలాలు పరిశీలించిన మాజీ ఉపసభాపతి

58చూసినవారు
పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం సీతనపల్లిలో నీటమునిగిన పొలాలను మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ రైతులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతులను ఆదుకోవాలని కోరారు. వారం రోజులుగా సీతనపల్లిలో పంట పొలాలు నీటి ముంపులో ఉన్నాయని, వాటిని పరిశీలించి నష్టపరిహారం అందేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్