శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన నాంచారమ్మ

76చూసినవారు
శాకాంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన నాంచారమ్మ
కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామం వేంచేసియున్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారు ఆషాడ పౌర్ణమి సందర్భంగా శాకాంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు పార్థసారథి వివిధ రకాల కూరకాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు ఆదివారం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో సుధాకర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్