ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వ పాలన: ఎమ్మెల్యే

84చూసినవారు
ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వ పాలన: ఎమ్మెల్యే
ప్రజా సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఘంటసాల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద 100 రోజుల ప్రభుత్వ పాలనపై గ్రామసభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటి అమలు చేస్తున్నది కూటమి ప్రభుత్వమే అన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజా మద్దతు బాగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్