విజయవాడలో ఘోరానికి కారణం ఇదే?

67చూసినవారు
విజయవాడ నగరం పటమటలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సొంతంగా ఆసుపత్రిని ప్రారంభించే ప్రయత్నాల్లో అప్పులపాలు కావడంతో శ్రీనివాస్ ఒక ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగా.. భార్య, ఇద్దరు పిల్లలను, కన్నతల్లిని కడతేర్చి తానూ ఉరివేసుకుని తనువు చాలించారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు నమ్మిన స్నేహితులు చేసిన మోసంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీనివాస్.. ఇంట్లో అందరినీ చంపి, తాను కూడా ప్రాణం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్