కొల్లేరు లంకగ్రామాల్లో తాగునీటి వసతి కల్పించేందుకు ఓఎన్జీసీ సంస్థ అధికారులు చేయూతనివ్వాలని తెదేపా వడ్డి సాధికారక రాష్ట్ర కన్వీనర్ బలే సురాజు కోరారు. వెనుకబడిన ప్రాంతాల్లో 30 రక్షిత మంచినీటి ట్యాంకుల నిర్మాణాలకు ఓఎన్ జీసీ సహకారం అందిస్తున్న నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సూచనల మేరకు రాజమహేంద్రవరం ఓఎన్ జీసీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రామారావును కొల్లేరు నాయకులతో కలిశారు.