లారీని ఢీ కొట్టి యువకుడు మృతి

55చూసినవారు
లారీని ఢీ కొట్టి యువకుడు మృతి
మచిలీపట్నంలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. కృత్తివెన్ను మండలం మునిపేడ వయా మచిలీపట్నంకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పాండు రంగారావు(24) అనే యువకుడు అతివేగంతో మచిలీపట్నం కోతి బొమ్మ సెంటర్ వద్ద లారీని ఢీ కొట్టి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగమే యువకుడు మృతికి కారణమని యాక్సిడెంట్ అయిన విధానం చూస్తే తెలుస్తుందని స్థానికులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్