నదీ పరివాహక ప్రాంతాల్లో పునరావస కేంద్రాలు ఏర్పాటు

65చూసినవారు
కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా నది పరివాహక ప్రాంతమైన తోట్లవల్లూరు మండలం నుంచి నాగాయలంక మండలం వరకు పునరావస కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్