ఇబ్రహీంపట్నం: కోడిపందాల శిబిరాలపై పోలీసుల దాడి

76చూసినవారు
ఇబ్రహీంపట్నం: కోడిపందాల శిబిరాలపై పోలీసుల దాడి
ఇబ్రహీంపట్నంలోని చిన్నలంక, రాయనపాడు గ్రామాల్లో శనివారం కోడిపందాల శిబిరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జోరుగా నిర్వాహకులు పందెం నిర్వహించారు. సుమారు 80 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ట్రాక్టర్ సహాయంతో పందెం రాయుళ్ల వాహనాలను పోలీసులు స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్