క్షయవ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్సా విధానంపై ఎంఓ డాక్టర్ గాయత్రి, ఎంపీహెచ్ఎస్ బాబురాజు అవగాహన కల్పించారు. మంగళవారం ఆదోనిలోని ఆరంజ్యోతి మ్యాక్ సెంటర్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఆర్టిపిసిఆర్ వంటి ఆధునిక పరీక్ష విధానంతో క్షయవ్యాధిని తొలిదశలో నిర్దారించవచ్చన్నారు. సమతుల్య ఆహారం, మందులు వాడటం వల్ల వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చన్నారు.