పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుంటే అది భావితరాల ఆరోగ్యాన్ని కాపాడుతుందని భవిత హోమ్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీరేష్, కార్తీక్ అన్నారు. బుధవారం ఆదోనిలోని ప్రధాన రోడ్డు, పార్కుల వద్ద 140 మొక్కలను నాటారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చెట్లను దత్తత తీసుకొని వాటిని పరిరక్షించేందుకు ముందుకు రావాలన్నారు. మొక్కలు నాటేందుకు యువత సంకల్పించాలన్నారు.