ప్రజలు ప్రశాతంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా భరోసా కల్పించేందుకు ఆదోని మండలంలోని పెద్దతుంబళం గ్రామంలో పోలీసు కవాతు నిర్వహించినట్లు ఎస్ఐ పీరయ్య, తాలూకా ఎస్ఐ ఎర్రిస్వామి, ఎస్ఐ శ్రీనివాసులు ఆదివారం విలేకరులకు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణంలోని ప్రధాన రహదారుల్లో కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు.