పీర్ల దేవుళ్లను దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చిన జనం

75చూసినవారు
పీర్ల దేవుళ్లను దర్శించుకోవడానికి భారీగా తరలివచ్చిన జనం
మొహరం పండుగ చివరి ఘట్టం నేటితో ముగియనున్న నేపథ్యంలో పీర్ల దేవుళ్లకు వీడ్కోలు పలకడానికి బుధవారం హొళగుంద లో ప్రజలు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. వేలాదిగా ప్రజలు తరలిరావడంతో బస్టాండ్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సంవత్సరానికి ఒకసారి వచ్చే మొహరం పండుగ జరుపు కోవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటన లు జరగకుండా ఎస్ఐ పెద్దయ్య నాయుడు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్