సి. బెళగల్ పట్టణంలోని భవిత కేంద్రంలో ఫిజియోథెరపీపై ఫిజీషియన్లు రమేష్, మహేష్ కుమార్ అవగాహన కల్పించారు. శుక్రవారం ఎంఈఓలు ఆడమ్ బాషా, జ్యోతిలు హెచ్ఎంలను సమీక్షించి, ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అవయవ లోపం ఉన్న ప్రతిఒక్కరిని ఇక్కడే గుర్తించి భవిత కేంద్రంలో వారి పేర్లు నమోదు చేయించాలన్నారు. ప్రభుత్వం తరఫున ఉచితంగా పిజియోథెరపి చేయించి, అవసరమైతే పరికరాలు ఇస్తారన్నారు.