పట్టాలపై ఇసుక కుప్ప.. రైలు నిలిపివేసిన లోకో పైలట్ (Video)

66చూసినవారు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పట్టాలు తప్పించుకునేందుకు కుట్రలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన రాయ్‌బరేలీ జిల్లాలో జరిగింది. ఖీరూన్ పీఎస్ పరిధిలోని రఘురాజ్ సింగ్ రైల్వే‌స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఇసుక కుప్పను పోశారు. లోకోపైలట్ గమనించి, రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్