సూపర్ సిక్స్ పథకాల అమలులో టీడీపీ విఫలం: పి. మురళీకృష్ణ

71చూసినవారు
సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యారని కర్నూలు డీసీసీ అధ్యక్షుడు పి. మురళీకృష్ణ విమర్శించారు. సోమవారం ఆయన కర్నూలులో మాట్లాడారు. 100 రోజుల పాలనను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 25న థాలి భజావో నిరసన తెలపనున్నామన్నారు. థాలి భజావో నిరసన కార్యక్రమాన్ని డీసీసీ కార్యాలయంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో చేపట్టాలని పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్