సైకో జలగను ఇంటికి సాగనంపండి: చంద్రబాబు

82చూసినవారు
ఏపీని పట్టి పీడిస్తున్న సైకో జలగను మే 13న జరిగే ఎన్నికల్లో ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆదివారం మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళంలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని అన్నారు. టీడీపీకి ఓటు వేసి ఏపీని కాపాడాలని కోరారు.

ట్యాగ్స్ :