చంద్ర బాబు నాయుడు కల్లబొల్లి మాటలు నమ్మవద్దు అని అమలు పరచటానికి వీలు కాని హామీలతో టిడిపి ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసిందని ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో వైసిపికి ఓటు వేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రం గడివేముల లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు వైసిపి హయంలో మంచి జరిగింటేనే తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు.