ఖనిజ అక్రమ రవాణా చేస్తున్న నాలుగు వాహనాలు సీజ్

67చూసినవారు
ఖనిజ అక్రమ రవాణా చేస్తున్న నాలుగు వాహనాలు సీజ్
అక్రమంగా ఖనిజ రవాణా చేస్తున్న నాలుగు వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు కర్నూలు జిల్లా మైనింగ్ శాఖ డీడీ రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాపరాయి లోడ్ తో వెళ్తున్న లారీని పాణ్యం వద్ద, క్వార్ట్ పౌడర్ లారీ, డోలమైట్ లారీ, ఇసుక ట్రాక్టర్ ను నన్నూరు టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. ఆ వాహనాలను సమీప పోలీస్ స్టేషన్ల కు తరలించికేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్