టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు బుధవారం ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో వెలసిన శ్రీశ్రీ చింతలముని స్వామి గుడిలో 111 టెంకాయలతో పూజలు నిర్వహించారు. ఆయురారోగ్యాలతో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ పూజ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.