వాహనదారులు వేగం తగ్గించుకునేందుకు స్పీడ్ బ్రేకర్లు ఉన్న చోట సూచికలు ఏర్పాటు చేయాలని ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ నూర్ అహ్మద్ కోరారు. బుధవారం ఆదోని డివిజన్లోని బినిగేరి వద్ద స్పీడ్ బ్రేకర్పై లారీ వేగంగా వెళ్లడంతో కుదుపుకు భారీ ఇనుప రీలు రోడ్డుపై పండిందన్నారు. పెను ప్రమాదం తప్పిందన్నారు. సూచనలు ఏర్పాటు చేసి ఇలాంటి ప్రమాదాలు నివారించాలని కోరారు.