అహోబిలంలో తెలుగు గంగ కాలువలో బాలుడు గల్లంతు

57చూసినవారు
అహోబిలంలో తెలుగు గంగ కాలువలో బాలుడు గల్లంతు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సోమవారం జరిగిన వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లాలు భాష అనే బాలుడు (12) తెలుగు గంగ ప్రాజెక్టు నీటిలో పడి కొట్టుకొని పోయాడు. గ్రామానికి చెందిన నలుగురు పిల్లలు వినాయకుని నిమజ్జనం వెంటవెళ్లగా నిమజ్జనం జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బాలుడు నీటిలో కొట్టుకొని పోవడంతో గ్రామంలో సోమవారం విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్