హొళగుందలో అంగరంగ వైభవంగా హను మాన్ శోభయాత్ర

58చూసినవారు
హొళగుంద మండలం కేంద్రంలో స్థానిక బాల ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ శాఖల ఆధ్వర్యంలో బుధవార ఉదయం వీర హనుమాన్ విజయ శోభయాత్ర నిర్వహించారు. హనుమంతుడి భారీ విగ్రహ మూర్తిని ట్రాక్టరపై ఉంచి జై శ్రీరామ్ అంటూ ఊరేగించారు. యువకులు, ప్రజలు స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలూరు సీఐ వెంకటేశ్వర్లు బందోబస్తు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్