మద్దిలేటి నరసింహ స్వామి హుండీ లెక్కింపు

73చూసినవారు
మద్దిలేటి నరసింహ స్వామి హుండీ లెక్కింపు
బేతంచర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం శివార్లలో వెలిసిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దేవదాయ శాఖ అధికారి బ్రహ్మారెడ్డి పర్యవేక్షణలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. మొత్తం 29 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలు, ముడుపుల ద్వారా రూ.18,26,371 నగదుతో పాటు 20 గ్రాముల బంగారు, 940గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు తెలిపారు.

సంబంధిత పోస్ట్