రాష్ట్ర పరిస్థితి బాగోలేదని కేంద్ర రైల్వే సహాయ మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ముఖ్య మంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖం చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓట్లు వేసి తప్పు చేశారని ఆయన విమర్శించారు. ఆదివారం ప్యాపిలిలో వివాహ వేడుకలకు హాజరైన ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.
తెదేపా రాష్ట్ర కార్యదర్శులు వై. నాగేశ్వరరావుయాదవ్, వలసల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.