తప్పిన ప్రమాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న వాహనం

56చూసినవారు
కోడుమూరు మండల కేంద్రం కోడుమూరులోని బళ్ళారి రోడ్డులో ఉన్న విద్యుత్ సరఫరా ప్రధాన స్తంభాన్ని ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రెండు స్తంభాలు పూర్తిగా విరిగిపోయింది. విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో కొండపేట, మెయిన్ రోడ్డు, లక్ష్మినగర్, వెంకటేశ్వరనగర్, షణ్ముఖరెడ్డి, చిన్నబోయ వీధి, కోటవీధిలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ట్రాన్స్ కో సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్