శ్రీ మఠంలో కావలి ఎమ్మెల్యే దంపతులు

67చూసినవారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దంపతులు శుక్రవారం విచ్చేశారు. వీరికి ముందుగా శ్రీ మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తదనంతరం శ్రీ మఠం లో పల్లకి సేవ లో పాల్గొన్నారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు శేషవస్త్రం కప్పి ఫలమంత్రాక్చితలు ఇచ్చి రాఘవేంద్ర స్వామి జ్ఞాపికను అందజేసి ఆశీర్వదించారు. వీరి వెంట మఠం అధికారులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్