రోల్లపాడు, తలముడిపి గ్రామాలలో బైరెడ్డి ఎన్నికల ప్రచారం
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోళ్ళపాడు, తలముడిపి గ్రామాలలో టిడిపి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాలలో పర్యటిస్తూ పార్లమెంటు టిడిపి అభ్యర్థి బైరెడ్డి శబరి రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరారు. గ్రామ పెద్దలు గుండం శివ నాగిరెడ్డి, బీసీ నాగిరెడ్డి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.